Thursday, July 07, 2011

దొంగల ముఠా కేంద్రం - DMK

ఎ. రాజా..
కనిమొళి
దయానిధి మారన్..

దొంగల ముఠా కేంద్రం (DMK)లో ప్రధాన సభ్యులు.. UPA ప్రభుత్వంలో ఎన్నో భాగస్వామ్య పక్షాలున్నాయి. ఆయా పార్టీలకు చెందిన మంత్రులెంతోమంది కేబినెట్ లో ఉన్నారు. అయితే.. ఎవరిపైనా లేనన్ని.. రానన్ని ఆరోపణలు కేవలం DMK సభ్యులపైన మాత్రమే రావడం ఆలోచించాల్సిన విషయం.. దేశాన్ని దోచుకోవాలనే పక్కా ప్లాన్ తోనే DMK... UPA ప్రభుత్వంలో చేరినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వంలో చేరినది మొదలు వీరంతా.. సొంత వ్యవహారలను.. సొంత రాష్ట్ర ప్రయోజనాలను చక్కదిద్దుకునేందుకే ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది. కనీసం తమిళనాడుకు ఎంతో కొంత మేలు జరిగినా బాగుండేది.. కానీ వీళ్లంతా.. సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేశారు.

2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో ఇప్పటికే దొంగల ముఠా కేంద్రం (DMK) అధ్యక్షుడు కరుణానిధి పార్టీకి చెందిన రాజా ఊచలు లెక్కబెడుతున్నారు. ఇక.. కూతురు కనిమొళి కూడా తీహార్ జైల్లో అల్లికలు నేర్చుకుంటూ పుస్తకాలు చదువుకుంటోంది.. ఇప్పుడు మనవడు దయానిధి మారన్ వంతు వచ్చింది. నేడో రేపో దయానిధి మారన్ కూడా తీహార్ జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. పాపం ఈ వయసులో ముసలాయను ఎన్ని కష్టాలు వచ్చాయో..!

కుటుంబ రాజకీయాలు ఎంత ప్రమాదకరమో DMKను చూసి అర్థం చేసుకోవచ్చు.. కరుణానిధి నియంతృత్వ ధోరణి వల్లే.. కుటుంబసభ్యులకు తప్ప మరెవరికీ ఆ పార్టీలో అగ్రస్థానం దక్కలేదు. సొంత మనుషులు కావడంతో.. కరుణానిధి కూడా చూసీచూడనట్లు వ్యవహరించారు. చివరకు ఆ అలసత్వమే ఆయన కొంపముంచింది. రాజాను మందలిస్తే.. కనిమొళి ఏమనుకుంటుందోనని భయం.. ఎందుకంటే.. రాజాకు, కనిమొళికి మధ్య అంతటి సన్నిహిత సంబంధాలున్నాయి మరి..!

ఇక దయానిధి మారన్ మనవడైపోయాడు.. తమిళనాడులో దయానిధి మారన్ కు చెందిన సన్ నెట్ వర్క్ ప్రభావం అంతాఇంతా కాదు. దీంతో.. ఓ సారి తన్ని తరిమేసినా.. మళ్లీ దరిచేర్చుకున్నాడు. ఇక ఓ కుమారుడి ( స్టాలిన్)కు తమిళనాడు ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాడు. దీంతో.. ఇంకో కుమారుడు (అళగిరి) ఏమనుకుంటాడోనని తనను ఏకంగా కేంద్ర మంత్రి పదవి ఇప్పించాడు.. ఇదీ దొంగలముఠా కేంద్రం కుటుంబ పాలన..!

మొత్తానికి ఇంటిదొంగలు తిన్న ఇంటి వాసాలు లెక్కపెడుతున్నా... మీడియా కోడై కూసేంతవరకూ ప్రధాని మన్మోహన్ సింగ్ పట్టించుకోకపోవడం బాధాకరం. అయనా.. ఆయన చేతిలో ఏముందిలే! వీళ్లను బయటకు పంపిస్తే.. తన సీటుకే ఎసరు వస్తుందేమోనని ఆయన భయం..!

ఇంటిపనులు చక్కదిద్దుకోలేక కరుణానిధి చచ్చిపోతుంటే... మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, కరుణానిధి పాపాల చిట్టా బయటకు తీస్తోంది. కరుణానిధి హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను వెలికితీస్తోంది. అవి కూడా బయటకు వస్తే.. పాపం ఈ దొంగలముఠా అంతా కలిసి తీహార్ జైల్లో ఒకరు జేబులు మరొకరు కొట్టుకుని బతకాలేమో..?

No comments: